నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పారిశ్రామిక పెట్టుబడులకు కేంద్రంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వం, ఈ మేరకు తొలి అడుగులు ఆరంభించింది. ఇప్ప టికే రెండు జిల్లాల పరిధిలో ఏపీఐఐసీ భూ బ్యాంకులు సిద్ధం చేసింది. దశల వారీగా మౌలిక వసతులు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆదర్శ పారిశ్రామిక వాడ (మోడల్ ఇండస్ట్రియల్ పార్కు, ఆహార ఉద్యానవనం(మెగా ఫుడ్ పార్కు) నెలకొల్పేలా రెండేళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించింది. భూ సేకరణ, కేటాయింపుల కసరత్తు తుది దశకు రావడంతో, ఇప్పుడు పరిశ్రమల స్థాపన వేగవంతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టింది.

ashok leyland 30032018

ఇందులో భాగంగానే శనివారం ప్రముఖ రవాణా వాహనాల తయారీ సంస్థ అశోక్ లేల్యాండ్ యూనిట్లు అంకురార్పణ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు స్వయంగా దీనికి భూమి పూజ చేస్తారు. ఈ తర్వాత మరిన్ని పరిశ్రమలు కొలువుదీరనున్నాయి. మల్లవల్లి గ్రామంలో రూ. 135కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో ఏటా 2400 బస్ బాడీలు తయారు చేసే బిల్లింగ్ యూనిట్సు రూ.90 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రెండు దశలో మరో రూ.45 కోట్లతో 2400 బస్ బాడీలను తయారు చేసే మరో యూనిటీను ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థకు 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ యూనిట్లలో 2400 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.. రేపు ఈ సీన్ చూడబోయే కొంత మంది, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రా రాజకీయాలు చేసే వాళ్ళు, ఏడుపులు వర్ణనాతీతంగా ఉంటాయి... ఈ కడుపు మంట చల్లార్చుకోటానికి, మళ్ళీ ఆంధ్రాకు వచ్చి ఏ విషం చిమ్ముటారో...

ashok leyland 30032018

మల్లవల్లి గన్నవరం దగ్గర ఉన్న, మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో మొత్తం 1260.06 ఎకరాల సువిశాల భారీ మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో 964 ప్లాట్లు ఉండగా, కేటాయింపులకు ముందే హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది... మరో పక్క ఇదే ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో, మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థకు ఇంటిగ్రేటెడ్‌ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటుకు 81 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది... భారీ పరిశ్రమల కేటగిరిలో ఇవి పోను గోల్డ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనేక స్పి న్నింగ్‌ మిల్లులు, ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి..

Advertisements