డిసెంబర్ నెలలో బిల్‌ గేట్స్‌ రాష్ట్రానికి వస్తున్న సంగతి తెలిసిందే... అయితే బిల్ గేట్స్‌ రక కంటే ముందే, బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన ఓ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.

గురువారం ఈ బృందం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుంది. ఈనెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది.

రాష్ట్రంలో భూసార పరీక్షల కోసం ఫౌండేషన్‌ సాంకేతిక సహకారం ఇవ్వనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన భూసార పరీక్షలు, వాటి ఫలితాలు, రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డుల పంపిణీ విధానాలను వంటి వాటిపై వ్యవసాయశాఖ ఈ బృందానికి వివరించనుంది.

వీటిని అన్నిటినీ క్రోడీకరించి, బిల్‌ గేట్స్‌ కు, రిపోర్ట్ ఇవ్వనుంది ఈ బృందం...

Advertisements