ఆంధ్రప్రదేశ్ ఆర్దిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఆయన పాత్ర ఏమీ కనిపించడం లేదు. అసలు అయితే ఇలాంటి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీఆయనే చూసుకోవాలి. కాని ఈ మధ్య చాలా విషయాల్లో ఆయన అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాలన్నీ సజ్జల లే చూసుకుంటున్నారు. AP ఉద్యోగుల పీఆర్సీ పై ఇంత ఎత్తున సమ్మె జరుగుతున్నా బుగ్గన దీని పై ఏమి స్పందిచకపోవడం  గమనార్హం. ఒక్కసారి మాత్రం ఉద్యోగుల ను సమ్మె చేయకుండా నచ్చ చెప్పడానికని ఒక  మీటింగు ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్ కు వచ్చి ఊరికే అలా కూర్చొని  వెళ్లి పోయారు. ఆ మీటింగులో కూడా  కనీసం ఆయన ఏమి మాట్లాడక పోవడం పై ఉద్యోగులు కూడా అయోమయానికి గురయ్యారు. ఆ మీటింగులో కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి దే డామినేషనగా కనిపించింది. అయితే వేరే మంత్రులు పేర్ని నాని, బొత్సలను ఉన్న కూడా సజ్జలే మీడియాతో మాట్లాడారు. ఇందంతా చూస్తుంటే  AP లో అన్ని విషయాలపై  సజ్జల దే ముఖ్య పాత్ర గా కనిపిస్తుంది. అయితే అసలు బుగ్గన ఈ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఎందుకు కల్పించుకోవడం లేదో అర్ధం కావట్లేదంటున్నారు. మరో వైపు బుగ్గన మాత్రం ఎక్కువగా  డిల్లి లోనే  ఉంటున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు తేవటంలో ఆయన బిజీగ ఆన్నారు. ఏపిలో ఉద్యోగుల విషయంలో బుగ్గన మాత్రం అ వివాదాలన్నీ తనకేందుకులే అని, ప్రభుత్వం  డిల్లి లో ఎవర్ని కలిసి రమ్మంటే వారిని కలిసి వస్తున్నారట .ఈయన ఎందుకు ఇలా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు అనే విషయం పై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisements