తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు ఈ మద్య వరుస పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. ఆయన ప్రతి పర్యటనకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది, ఆయన మీటింగులకి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు.  అటు కర్నూల్ ,ఇటు గోదావరి జిల్లాల్లో  చంద్రబాబుకి జనం బ్రహ్మరధం పట్టారు. ఇటు ఆంద్ర లోనే కాకుండా అటు తెలంగాణా లో కూడా టిడిపి తన సత్తా చూపెడుతోంది. దీనికి ఉదాహరణ నిన్న చంద్రబాబు ఖమ్మం జిల్లా పర్యటనే . ఇలా అన్నీ ప్రాంతాల్లో  చంద్రబాబు కి వస్తున్న విశేష స్పందన చూసి తెలుగు తమ్ముళ్ళు మంచి జోష్ లో ఉన్నారు. ఇదే ఊపుతో చంద్రబాబు మళ్ళీ ఈ రోజు విజయనగరంలో  పర్యటించనున్నారు. నిన్న ఖమ్మం జిల్లా  పర్యటన ముగిసిన తరువాత  అర్ధరాత్రి చంద్రబాబు ఆయన నివాసం ఉండవల్లికి చేరుకున్నారు.  చంద్రబాబు ఈ రోజు  ఉదయం 10 కి  గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బయలుదేరి వైజాగ్ కు చేరుకోనున్నారు. అక్కడనుంచి  ర్యాలీగా రోడ్డు మార్గంలో సాయంత్రానికి రాజాం కు వెళ్లనున్నారు. ఆ తరువాత రాజాంలో చంద్రబాబు రోడ్ షో ఉంది,ఆ తరువాత  బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.  రాత్రికి రాజాంలో జరిగే  క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు  పాల్గొంటారు. 3 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ రోజు రాత్రికి చంద్రబాబు రాజాంలో బస చేస్తారు.

Advertisements