అప్పట్లో వైసిపి నేతలు గుడివాడలో కొడాలి నాని అనుచురాల ద్వర్యంలో విచ్చలవిడిగా కాసినోలు నడిపిన సంగతి తెలిసిందే.  దీనిపై తెలుగుదేశం పార్టీ ఐటీ శాఖకు ఇచ్చిన  ఫిర్యాదుపై ఐటీ  డిపార్ట్మెంట్ ఇప్పుడు స్పందించింది. గుడివాడలో  క్యాసినో వ్యవహారం పై వల్లభనేని వంశీ , కొడాలి నాని ఈడీ, డీఆర్ఐ, సీబీడీటీ,  కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ డిపార్ట్మెంట్ లకు అప్పట్లో తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని పై ఐటీ డిపార్ట్మెంట్ ఇప్పుడు విచారణ మొదలు పెట్టింది. సమాచారం సేకరణలో భాగంగా ఐటీ డిపార్ట్మెంట్ టిడిపి నేత వర్ల రామయ్యను పిలిచింది . గుడివాడ లో క్యాసినో వ్యవహారం లో  వారి  దగ్గర ఉన్న  సమాచారం మొత్తం అందించాల్సిందిగా టిడిపి నేత వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు పంపించింది. .

Advertisements