చంద్రబాబు కృషి చేస్తున్నట్టుగానే నవ్యాంధ్ర పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది... ఆటోమొబైల్‌ రంగం మొదలుకొని సెల్ ఫోన్‌ తయారీ పరిశ్రమల వరకు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తిని ఆరంభించగా మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణం... ప్రభుత్వం నుంచి లభిస్తున్న సహకారం కారణంగా చిన్న సంస్థలే కాదు కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా ఇటు దృష్టి సారించాయి... ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు చూస్తే దేశంలోనే నెంబర్ వన్ గా నవ్యాంధ్ర ఉంది.... ఇప్పటికే ఇసుజు, కియా, హీరో కంపెనీలు, వచ్చాయి... 

honda 16112017 2

మరో పక్క దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ ‘హ్యూసంగ్‌’, స్పెయిన్‌కి చెందిన గ్రూపో ఆంటోలిన్‌ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టటానికి సిద్ధంగా ఉన్నాయి... మరో పక్క టయోటా ద్యుత్తు కార్ల తయారీ పరిశ్రమను మన రాష్ట్రానికి తీసుకురావటానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు... ఇప్పుడు తాజగా జపాన్‌కు చెందిన ‘హోండా’కూడా మన రాష్ట్రంలో ప్లాంట్ పెట్టటానికి సిద్ధంగా ఉంది... చర్చలు ప్రాధమిక దశలోనే ఉన్నా, జరుగుతున్న విషయాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు... దీనికి బీజం, చందబాబు 2014 జపాన్ పర్యటనలో పడింది... అప్పటి నుంచి రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు ఫాలో అవుతూ ఉన్నారు...

honda 16112017 3

‘హోండా’కు ఇప్పటికే కర్నాటకలోని యూనిట్‌ ఉంది... అక్కడ రోజుకు 6,600 మోటార్‌ సైకిళ్లను తయారు చేస్తోంది. ఆంధ్రాలో అంతకంటే పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ఆ సంస్థ యోచనగా ఉంది. ఇక్కడ పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు అనుకూలమైనవిగా భావిస్తున్నారు. కావాల్సిన భూమి ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.

Advertisements