ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి జగన్ పుట్టినరోజు అని వైసిపి నేతలు చేసిన ఖర్చు హడావిడి అంతా ఇంతా కాదు. దాదాపు నెల రోజుల ముందు నుంచే జగనన్న స్వర్నో త్సవాలు పేరుతో తెగ హడావిడి చేసారు. ఇక మంత్రి రోజా హడావిడి అయితే అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆవిడ డాన్సులే. ముఖ్యమంత్రి పుట్టినరోజు అయితే ప్రజల సొమ్ము ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలా అని కూడా అని జనం అభిప్రాయ పడుతున్నారు. అయితే నిన్న జగన్ పుట్టిన రోజు సందర్భంగా పవిత్ర నది  గోదావరిలో వైకాపా నేతల అసభ్య డ్యాన్సులు వేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వైకాపా నేతలు  గోదావరి నది మధ్య పంటుపై జగన్మోహన్రెడ్డి  బర్త్ డే  వేడుకలు  జరిపినట్టు అక్కడ స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి గోదావరి పంటుపై ప్రమాదకరంగా డ్యాన్సులు వేసారని, ఎంతో  పవిత్రంగా భావించే  గోదావరి తల్లిని  అపవిత్ర పరిచారని హిందూ సంఘాల మండిపడుతున్నాయి.

Advertisements