ప్రతిపక్ష నాయకుడు జగన్ మహాన్ రెడ్డి నోటికి అడ్డు అదుపూ అనేది లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే ఉరి వేస్తా, బట్టలు విప్పుతా, కాల్చేస్తా, చీపిరితో కొడతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఎమ్మల్యేల పై కూడా ఇలాగే విమర్శలు చేస్తున్నారు. అయితే, సిన్సియర్ ఐఏఎస్ అధికారుల పై కూడా, ఇలాంటి మాటలే మాట్లాడుతూ, సొంత పార్టీ నేతల చేత ఛీ కొట్టించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కాటంనేని భాస్కర్‌ సుధీర్ఘకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారని, ఆయనను ఇక్కడ ఎందుకు అంతకాలం పనిచేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యేలతో కలసి దోచుకున్న సొమ్మును కలెక్టర్‌ చంద్రబాబుకు చేరవేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

jagan 22062018 2

నాలుగేళ్లుగా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్ పై జిల్లా వైకాపా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఆయన అవినీతికి పాల్పడినట్లు కానీ, చంద్రబాబుకు ముడుపులు ఇస్తున్నారని కానీ ఈ నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ విమర్శించలేదు. అత్యంత నిజాయితీపరుడైన యువ ఐఎఎస్‌ అధికారిగా భాస్కర్‌ కు పేరుంది. ఇటువంటి విమర్శలు, ఆరోపణలు వస్తాయనే కారణంతోనే తనను బదిలీ చేయాలని ఆయన కోరుతున్నా, సిఎం చంద్రబాబు మాత్రం ఒప్పుకోవటం లేదు.

jagan 22062018 3

అయితే జగన్ కలెక్టర్ పై విమర్శలు చెయ్యటంతో, స్థానిక వైకాపా నాయకులు ఈ వ్యవహారంపై మాట్లాడుతూ తమ అధినేతను, ఎవరో తప్పుదోవపట్టించా, జిల్లా కలెక్టర్‌ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారైనా, ఆయన ఎప్పుడు కులపక్షపాతం వహించలేదని, అందరినీ ఆయన దగ్గరకు తీస్తారని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ పై ఆరోపణలు చేసిన జగన్‌ పై చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన కొందరు అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేయడం, పోలవరం ప్రాజెక్టును ఒక కొలిక్కి తేవడం, మారు మూల ప్రాంతాలకు సైతం సుపరిపాలన అందించి ప్రజా కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న భాస్కర్‌ పై ఇటువంటి ఆరోపణలు చేయడం విడ్డూరమని వారు అంటున్నారు.

Advertisements