ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎలక్షన్స్ అయ్యేవరకు  మంత్రులు ఎవ్వరూ అవినీతికి పాల్పడొద్దని, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి,టివి 5,ఇంకా కొన్ని  ఛానళ్ల కళ్లన్నీ మీమీదే ఉంటాయి కాబట్టి మీరు ఎవ్వరూ అవినీతికి పాల్పడొద్దని  సీఎం జగన్, మంత్రులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మీరు ఏ చిన్న తప్పు చేసినా దానిపైనే,  మీడియా ఎక్కువగా ఫోకస్ చేసి, వరుస పెట్టి టివీల్లో ఊకదంపుడు దంచుతారని జగన్ మంత్రులకు తేల్చి చెప్పారు. ఇటువంటి వార్తలు మీడియాల్లో వస్తే  దాని  ప్రభావం ఎలక్షన్‍పై తీవ్రంగా  ఉంటుందని జగన్ మంత్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.  మంత్రులందరూ  ఇకపై సొంత ప్రయోజనాలు ఆశించకుండా, సంక్షేమ పథకాలపైనే  దృష్టి పెట్టాలని జగన్ దిశ నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు వాలంటీర్ల చేతుల మీదుగా నడుస్తున్న పథకాలు, ఇక నుంచి  మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేయాలని, అంతే కాకుండా గడపగడపకు ప్రతీ ఒక్కరూ వెళ్ళాలని , వెళ్లేలా ప్రతి ఒక్కరూ చూడాలని మంత్రులకు, జగన్  గట్టిగా వార్నింగ్ ఇచ్చారట

Advertisements