మాచర్ల టిడిపి నేతలకు హైకోర్టులో ఊరట ల‌భించింది. మాచ‌ర్ల‌లో ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వైసీపీ టిడిపిపై దాడులు చేసింది. అయితే టిడిపి నేత‌ల‌పైనే పోలీసులు నాన్ బెయిల‌బుల్ కేసులు బ‌నాయించారు. వైసీపీపై బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసులు పెట్టారు. మార‌ణాయుధాల‌తో చ‌ల్లా మోహ‌న్ అనే వైసీపీ నేత బెదిరించిన వీడియో టిడిపి నేతలు బ‌య‌ట‌పెట్టినా పోలీసు చర్య‌లు శూన్యం. ఈ కేసుల్లో ముంద‌స్తు బెయిల్ కోసం మాచ‌ర్ల టిడిపి ఇన్చార్జి బ్ర‌హ్మారెడ్డి స‌హా నిందితులు ఆశ్ర‌యించారు. విచార‌ణ జ‌రిపిన హైకోర్టు గతంలో వాదనలు విని ఆర్డర్స్ రిజర్వ్ చేసింది. A7 కళ్ళం రమణా రెడ్డికి తప్ప మిగిలిన టిడిపి నేతలకు  యాంటిసిపేట‌రీ బెయిల్ మంజూరు చేసిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Advertisements