సాక్షి దినపత్రికలో వచ్చే పిచ్చి వార్తలు, ఇప్పుడు జగన్ సతీమణికి చుట్టుకుంటున్నాయి... వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి, సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ భారతీరెడ్డికి, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్ రామచంద్రమూర్తికి కోర్టు నూజివీడు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

విజయవాడలో జరిగిన కాల్‌మనీ కేసులో, కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు పై సాక్షి పిచ్చి రాతలు రాసింది.. దీంతో, తనపై అసత్యవార్తలు రాసారంటూ కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సాక్షి దినపత్రికపై నూజివీడు కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ఇది ఇలా ఉండగా, ఈ కేసు వాయిదాలకి కోర్టుకు హాజరుకాకపోవడంతో సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ భారతీరెడ్డి, ఎడిటోరియల్‌ డైరెక్టర్ రామచంద్రమూర్తికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది.

Advertisements