తిరుమలలో సాధారణం కంటే భక్తుల రద్దీ బాగా  పెరిగిపోయింది. దీనితో సరైన సదుపాయాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో టోకెన్లు తీసుకొన్న భక్తులకు స్వామి వారి,  సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. స్వామి వారి  సర్వదర్శనానికి కంపార్టుమెంట్‍లలో  వేల మంది భక్తులు వేచివున్నారు. నిన్న ఒక్క రోజే  63,214 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.  ఇందులో 23,147 మంది భక్తులు  శ్రీవారికి తిరుమలలో తలనీలాలు సమర్పించారు.  నిన్న ఒక్కరోజు స్వామి వారి హుండీ ఆదాయం రూ.5.50 కోట్లు వచ్చినట్లు టిటిడి ప్రకటించింది.

Advertisements