ఒక పక్క, కాకినాడ ఎలక్షన్ చిచ్చు వల్ల, జగన్ కు, విజయసాయి రెడ్డికి చెడింది అని వార్తలు వస్తున్న టైంలో, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్‌ పిటిషన్‌ను హాట్ టాపిక్ అయ్యింది.

జగన్‌ అక్రమాస్తుల కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ విజయసాయిరెడ్డి, డిశ్చార్జ్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.

దీనికి సీబీఐ గెట్టి కౌంటర్ ఇచ్చింది... జగన్ కి ఆడిటర్‌ అయిన విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ పెట్టుబడిదారులను బెదిరించేవారు అని, దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి అని కోర్ట్ కి చెప్పింది, సిబిఐ.. క్విడ్‌ ప్రో కో కుట్ర కేసులో జగన్‌తో విజయసాయిరెడ్డి కుమ్మక్కయ్యారని పేర్కొంది..

ఈ పిటిషన్‌ను ఈ నెల 8న ప్రత్యేక కోర్టు విచారించనుంది...

Advertisements