బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి, మరో మూడేళ్ళ పాటు, సియం పదవిలో ఉంటారని అనుకోవటం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉన్నయి అని, ప్రభుత్వం కూడా హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని అన్నారు.  కరోనా నియంత్రణపై ప్రభుత్వ యంత్రాంగానికి శ్రద్ధ లేదని అన్నారు.  కేవలం భవనాలు కూల్చివేత, షాపుల తొలగింపుపై దృష్టిపెట్టారని అన్నారు. విద్యార్థులకు పరీక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. మూడేళ్లపాటు జగన్ సీఎంగా ఉంటారని అనుకోవడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాత్రి పూట కర్ఫ్యూ అనేది తుగ్లక్ చర్య అని అన్నారు. విశాఖపై దృష్టిపెట్టి మందుల కొరత లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.  ఔషధాలపై మూడు నెలలు జీఎస్టీ లేకుండా చూడాలని విష్ణుకుమార్ రాజు అన్నారు. అయితే రఘురామకృష్ణ రాజు, సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ పిటీషన్ విచారణకు తీసుకుందని చెప్పిన కొద్ది సేపటికే, విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు.

Advertisements