అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రా-ణ-హా-ని ఉందంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. రామకృష్ణారెడ్డి ఎంతో క్రియాశీలంగా ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు.ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా అక్రమ మైనింగ్ ను కూడా అడ్డుకుంటున్న నాయకుడు. అందుచేతనే, మైనింగ్ మాఫియా రామకృష్ణారెడ్డి ని, అతని కుటుంబ సభ్యులను చం-పే-స్తా-మ-ని, వారి ఆస్తిపాస్తులను ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు. దీనికి సంబంధించి రామకృష్ణారెడ్డి గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రామకృష్ణారెడ్డి తనకు రక్షణ కల్పించాలని తూర్పుగోదావరి ఎస్పీకి ఇచ్చిన లేఖను తన లేఖకు జత చేసిన చంద్రబాబునాయుడు. డీజీపీ వెంటనే స్పందించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కి, అతని కుటుంబ సభ్యులకు వెంటనే రక్షణ కల్పించాలని లేఖలో కోరిన చంద్రబాబు.
డీజీపీకి 69 పేజీల లేఖ పంపించిన చంద్రబాబు...
Advertisements