సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడానికి ఫైల్ సిద్ధం చేసింది. నిన్న హైకోర్టు, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది, క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఏబీవీని సర్వీస్‌లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నందున, పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశాయి. ఈమేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీస్‌లోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కాసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read