Sidebar

29
Tue, Apr

ఎపి సిఎంవోలో తాజాగా చోటు చేసుకున్న మార్పులతో, ఐఏఎస్ వర్గాల్లో చర్చకు దారి తీసాయి. గతంలో సిఎంవో వరిధిలో ఆయా అధికారులు నిర్వహించిన వనుల విధానం మారింది. వారికి కేటాయించిన వివిధ పని అంశాలను బుధవారం తాజా ఉత్తర్వులతో మార్పుచేసారు. పలు కీలక శాఖలను ముగ్గురు సిఎంవో అధికారుల నడుమనే కేటాయించారు. దీంతో సిఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మరింత కీలకంగా మారారు. సీఎంఓలో ఆయా అధికారులకు కేటాయించిన వని అంశాల జాబితాలో అజయ్ కల్లాంకు ప్రత్యేకించి ఎటువంటి అంశాన్ని కేటాయించలేదు. ఆయన ప్రధాన సలహాదారులుగానే వ్యవహరిస్తారు. అయితే కోరి మరీ తెచ్చుకున్న అజయ్ కల్లంకు సియం ఎందుకు పక్కన పెట్టారు, అనే విషయం పై చర్చ జరుగుతుంది. అలాగే మరో రిటైర్డ్ అధికారి పీవీ రమేష్ విషయంలో కూడా, ఇదే జరిగింది. ఆయన పవర్స్ కూడా కట్ చేసారు. దీంతో పీవీ రమేష్ రాజీనామా చేస్తారు అనే వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి తాజా నిర్ణయంతో, ప్రవీణ్ ప్రకాష్ మరింత పవర్ఫుల్ అయ్యారు.

సిఎంఓ వని బాధ్యతలను ప్రవీణ్ ప్రకాష్, సాల్మన్ ఆరోగ్యరాజ్, ధనుంజయ్ రెడ్డిల మధ్యనే విభజించారు. దీని ప్రకారం సిఎమ్ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సాధారణ పరిపాలన శాఖతో పాటు హోమ్, రెవిన్యూ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, న్యాయ లెజిస్ట్రేటివ్ వ్యవహారాలు, సిఎమ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇతర అనుబంధ విభాగాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు అన్ని అంశాలు ప్రవీణ్ ప్రకాష్ పరిధిలోనే ఉంటాయి. సాల్మన్ ఆరోగ్యరాజ్ కు రవాణా , రోడ్లు భవనాల శాఖ, హౌసింగ్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, వంచాయితీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, అన్ని సంక్షేమ శాఖలు, పరిశ్రమలు, వాణిజ్యం, మౌళిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటి, గనులు, కార్మిక ఉపాధి కల్పనా శాఖ, కె. ధనుంజయ్ రెడ్డికి జలవనరులు, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వ్యవసాయం అనుబంధ విభాగాలు, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ, ఎనర్జీ, టూరిజం, మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్, ఫైనాన్స్ కేటాయించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read