Sidebar

03
Sat, May

అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి నిరసన సెగ ఎదురు అయ్యింది. గుడ్ మార్నింగ్ అంటూ వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డిని షాక్ ఇచ్చాడు యువకుడు. మూడేళ్లయినా తనకు ఇంటిపట్టా రాలేదని కేతిరెడ్డిని నిలదీసాడు యువకుడు. కేతిరెడ్డి పై ప్రశ్నల వర్షం కురిపించాడు, ఆ యువకుడు. తనను నిలదీసిన యువకుడు ఆసిఫ్ పై ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే గత నెలలో లోకేష్ పాదయాత్ర ధర్మవరంలో జరిగిన తరువాత, కేతిరెడ్డి డ్రామాలు అన్నీ బయట పడ్డాయి. లోకేష్ , కేతిరెడ్డి గుట్టు మొత్తం బయట పెట్టాడు. అప్పటి నుంచి కేతిరెడ్డి తీవ్ర అసహనంతో ఉంటున్నారు. వారం క్రితం కూడా, ప్రజల పై రుసరుసలాడుతూ, మా ఫ్యామిలీ మొత్తం, మీ కొంపలు చుట్టూ తిరుగుతున్నాం అంటూ ప్రజల పై అసహనం వ్యక్తం చేసారు. ఇప్పుడు మరోసారి ఈ రోజు, తన అసహనం బయట పెట్టాడు కేతిరెడ్డి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read