Sidebar

14
Fri, Mar

ఏపీ ప్రభుత్వ తీరుతో ఏపీ చీఫ్ సెక్రటరీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డికి హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అధికారయంత్రాంగం పట్టించుకోలేదు. హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి పాఠశాలల ఆవరణలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు చేపట్టినట్లు పిటిషనర్లు కోర్టుకి తెలియజేశారు.  విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ సెక్రటరీ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read