చిత్తూరుజిల్లా కుప్పంలో ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన ఉండటంతో, పోలీసులు  అడుగడుగునా ఆంక్షలు విధించారు. చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు  పర్మిషన్  లేదంటూ పోలీసులు అడ్డు చెబుతున్నారు. ఈ రోజు శాంతిపురం వెళ్లాల్సిన తెలుగుదేశం ప్రచార రధాలను , సౌండ్ సిస్టం లవాహనాలను పోలీసులు నిలిపివేశారు. ప్రచార రధాలను నడిపే డ్రైవర్లను, సహాయక సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకొని గుడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30కు చంద్రబాబునాయుడు కుప్పంలోని శాంతిపురం మండలం పెద్దూరు రానుండటంతో, ఆ ఏరియా లో పోలీసులు భారీగా మోహరించడంతో, అక్కడ ఉద్రిక్త వాతవరణం నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read