Sidebar

28
Mon, Apr

చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న బి.కొత్తకోటలో ఈ రోజు దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జడ్జి రామకృష్ణ తమ్ముడు, రామచంద్ర పైన, కొంత మంది దుండగులు హత్యాయత్నం చేసారు. ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. దాదాపుగా అయుడుగురు దుండగులు ఒకేసారి ఆయన పై దాడి చేసి పారిపోయారు. బి.కొత్తకోట మెయిన్‌రోడ్‌ సెంటర్ లో సరుకులు కొనటానికి, జడ్జి రామకృష్ణ తమ్ముడు, రామచంద్ర బయటకు రాగా, ఒక కారులో వచ్చిన అయుదుగురు దుండగులు, ఒక్కసారిగా దాడి చేసారు. దాడి చేసి అక్కడ నుంచి పరారు అయ్యారు. దాడిలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ రామచంద్రని, ప్రాధమిక చికిత్స చేయించి, మదనపల్లిలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. గత కొంత కాలం నుంచి, జడ్జి రామకృష్ణ వైసీపీ పై ఆరోపణలు చేస్తున్నారు. అలాగే లోకల్ గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి పై కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీంతో తరుచూ పెద్దిరెడ్డి మనుషులు తనని వేధిస్తున్నారని, రామకృష్ణ చెప్తూ వస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే ఈ రోజు, కొంత మంది వచ్చి రామచంద్ర తమ్ముడి పై దాడి చేసారు. ఇప్పటికే రామచంద్ర పై అనేక కేసులు కూడా పెట్టి వేధిస్తున్నారు. మరో పక్క రామకృష్ణ పై కూడా అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెస్తున్నారు. అయితే నిన్న దళితులు అందరూ కలిసి, దళితులు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు. అందులో జడ్జి రామకృష్ణ, ప్రభుత్వం పై, పెద్ది రెడ్డి పై అనేక ఆరోపణలు చేసారు. ఇది కక్ష పెట్టుకుని, ఈ రోజు జడ్జి రామకృష్ణ తమ్ముడి పై దాడి చేసారని, రామకృష్ణ ఆరోపిస్తున్నారు. ఎన్ని చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఈ ప్రభుత్వం పై పోరాటం మాత్రం ఆపనని జడ్జి రామకృష్ణ అంటున్నారు. అయితే ఈ ఘటన పై తమకు సంబంధం లేదని, పెద్ది రెడ్డి అనుచరులు చెప్తున్నారు. వాళ్ళు అందరితో గొడవ పడతారని, ఎవరు దాడి చేసారో పోలీసులు తేలుస్తారని పెద్దిరెడ్డి అనుచరులు చెప్తున్నారు. ఈ ఘటన వీడియో, ఇక్కడ చూడవచ్చు.. https://youtu.be/nHO2Q3uF_0M

Advertisements

Advertisements

Latest Articles

Most Read