నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయడానికి సుముఖంగా ఉన్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలియజేసిన సంగతి తెలిసిందే. అలా ప్రత్యేక కోర్టులు ఏర్పడి ప్రజాప్రతినిథుల నేరాల విచారణ జరిగితే, ఇప్పటికే ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్లి సంతకం పెడుతున్న ప్రతిపక్షనాయకుడు జగన్, పరిస్థితి వర్ణనాతీతం.... సుప్రీం కోర్ట్ నిర్ణయంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మార్చి లోపు ఏర్పాటు చెయ్యక తప్పదు... క్రిమినల్ కేసులు ఉన్న చట్టసభల సభ్యులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ తప్పించుకోవాలంటే చట్టసభలకి రాజీనామా చెయ్యక తప్పదు. దేశ వ్యాప్తంగా ఉన్న కేసులు ఉన్న నాయకులు ఇదే ఆలోచనతో ఉన్నారు...

jagan court 15122017 2

దేశంలో కేసులు ఉన్న ప్రజా ప్రతినిదుల్లో అందరిలో కంటే, జగన్ మీద ఉన్న కేసులు, జగన్ మీద ఉన్న అవినీతి అభియోగాలు ఎక్కువ... అందుకే జగన్ కూడా, ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చెయ్యక తప్పదు అంటున్నారు... జగన్ కూడా రాజీనామా ఆలోచన చేస్తున్నాడు అని, అయితే తను ఒక్కడే రాజీనామా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి, ఎదో ఒక భావోద్వేగ అంశం ముడిపెట్టి తన పార్టీలో ఉన్న ఎమ్మల్యేలు, ఎంపిలు అందరితో రాజీనామాలు చేపించే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం... జగన్ తో పాటు, విజయసాయిరెడ్డికి కూడా ఈ ఐడియా వర్క్ అవుట్ అవుతుంది... ఎందుకు అంటే, జగన్ A1 అయితే, విజయసాయి A2..

jagan court 15122017 3

సిబిఐ కేసుల విచారణ, ఎన్నికల వరకు ఎదో ఒక విధంగా, వివిధ మార్గాల్లో లేట్ చెయ్యటానికి జగన్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాడు... అనుకోకుండా, సుప్రీమ్ ఈ నిర్ణయం ప్రకటించటంతో జగన షాక్ అయ్యాడు... ఎందుకు అంటే, ఇక్కడ ఏ ఒత్తిడులు పని చెయ్యవు... అందుకే రాజీనామా ప్లాన్ వేస్తున్నాడు జగన్... రాజీనామా చేస్తే, తాను ప్రజా ప్రతినిధి కిందకు రాను అని, అప్పుడు సుప్రీమ్ చెప్పిన విధానం తనకు వర్తించదు అని జగన్ ఆలోచన... ఇక్కడ జగన్ ఆలోచిస్తుంది మాత్రం ఒకటి ఉంది... రాజీనామా చేస్తే, స్పీకర్ ఆమోదిస్తారా లేదా అని... స్పీకర్ ఆమోదించకపోతే ఇరుక్కుంటాం అని జగన్ ఆలోచన.. దీని మీద, మరో 15-20 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాసం ఉంది.. ఈ లోపు ఎదో ఒక అంశం, హాట్ టాపిక్ చేసి, దాన్ని సాకుగా చూపి, రాజీనామాలు చెయ్యాలని అనే ఆలోచనలో ఉన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read