Sidebar

08
Thu, May

నిన్న ఢిల్లీలో ప్రాధాని మోడీ ఇంటి ముందు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు మెరుపు ధర్నా చేసిన విషయం తెలిసిందే... నెల రోజుల నుంచి, చంద్రబాబు, మోడీని ఏకి ఏకి పెడుతుంటే, పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేసారు.. ఎంత చేసినా, పార్లమెంట్ లో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు... పార్లమెంట్ వాయిదా పడినా, తెలుగుదేశం ఎంపీలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. ఆదివారం ఉదయం ఉన్నట్టు ఉండి, తెలుగుదేశం ఎంపీలు అందరూ, మోడీ ఇంటికి బయలు దేరి వెళ్లి, మోడీ ఇంటి ముందు, టిడిపి ఎంపీల మెరుపు ధర్నా నిర్వహించారు...

sumanth 09042018 1

అయితే వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు... ఢిల్లీ పోలీసు కమీషనర్ తో సహా అందరూ వచ్చేశారు.. ఎంపీలను ఈడ్చి అవతల పడేసారు.. బలవంతంగా వారిని తరలించే క్రమంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని, గల్లా జయదేవ్ ని పోలీసులు లాగి పడేశారు.. ఎంపీలు వినక పోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తరలించారు... అయితే, ఎంపీలను ఈ విధంగా, ఈడ్చి పడేయటం పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి... సాక్షాత్తు, ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చి ఎంపీలను పరామర్శించి, పోలీసుల తీరుని తప్పుబట్టారు... అయితే, ఈ విషయం పై, హీరో సుమంత్ స్పందించారు...

sumanth 09042018 1

ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ, అలా జయదేవ్‌‌కు జరగడం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోందంటూ హీరో సుమంత్ పోస్ట్ పెట్టారు. ‘నాకు తెలిసిన వ్యక్తుల్లో ది బెస్ట్ అయిన గల్లా జయదేవ్‌కు ఇలా జరగడం చూస్తుంటే చాలా బాధగా ఉంది’ అంటూ సుమంత్ గల్లా జయదేవ్ పెట్టిన పోస్ట్, ని రీ ట్వీట్ చేస్తూ స్పందించారు... ఒక్క జయదేవ్ కే కాదని, ప్రత్యేక హోదా కోసం, ఆందోళన చేస్తున్న అందరికీ మద్దతు పలుకుతున్నట్టు మరో పోస్ట్ కూడా పెట్టారు... ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పై, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర అసహనం ఉంది... ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, మన సమస్య పై సరైన స్పందన లేదు అనుకుంటున్న టైంలో, ఒక హీరో కనీసం ట్విట్టర్ ద్వారా అయినా స్పందించారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read