అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ నేపధ్యంలో, రాష్ట్రపతి భవన్ లో నిన్న సాయంత్రం రాష్ట్రపతి విందు ఇచ్చారు. ఈ విందుకు తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అనింది. అయితే దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాత్రం ఆహ్వానం అందలేదు. అయితే జగన్ కు ఆహ్వానం అందకపోవడం పై పలు విమర్శలు వచ్చాయి. జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టే, ఆయనకు ఆహ్వానం లేదు అంటూ, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ రాక నేపథ్యంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి జగన్​కు ఆహ్వానం అందకపోవటంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. సీఎం జగన్ దేశంలో బలమైన నాయకుడు కాబట్టే విందుకు ఆహ్వానించలేదని అన్నారు. జగన్ ఎంతో బలమైన నాయకుడు కాబట్టే ఆహ్వానం పంపించి ఉండక పోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు బొత్సా.

botsa 26022020 2

నిన్న చంద్రబాబు ఈ మధ్య ఈ విషయం పై మాట్లాడుతూ, ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశం వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆహ్వానం అంది.. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అందకపోవడం అవమానకరమని టిడిపి మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆర్థిక నేరగాడైన జగన్​ను ఆహ్వానిస్తే.. తనకు చెడ్డ పేరు వస్తుందనే ప్రధాని మోదీ.. డొనాల్డ్​ ట్రంప్​ పర్యటనకు ఆహ్వానం పంపలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్​ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు తెనాలి పక్కనున్న పెదరావూరు మహిళలకూ ఆయన పక్కన కూర్చునే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడం అవమానకరమని వ్యాఖ్యానించారు.

botsa 26022020 3

చట్టాలు చేసే స్థానాల్లో ఉన్న వారే, ఆయా చట్టాలపై నమ్మకం లేదన్నట్లుగా మాట్లాడే నేతల తీరుచూస్తుంటే, ఇలాంటివాళ్లకా మనం ఓట్లేసిందని ప్రజలంతా సిగ్గుపడుతున్నారన్నారు. 11 సీబీఐ ఛార్జ్ షీట్లలో ప్రథమ ముద్దాయిగా ఉన్న జగన్, రూ.43వేలకోట్ల అక్రమఆస్తులను జప్తు చేయించుకొని, దేశవ్యాప్తంగా అవినీతి చక్రవర్తిగా పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ వేయడం చూస్తుంటే హస్యాస్పదంగా ఉందన్నారు. న్యాయస్థానాలకు హాజరుకాకుండా, వారంవారం తప్పించుకు తిరుగుతున్న జగన్, ప్రజలను మభ్యపెట్టడానికే ఇటువంటి చిల్లర పనులు చేస్తున్నాడని ఆలపాటి దుయ్యబట్టారు. గత ప్రభుత్వ పాలనపై విచారణ జరుపుతానంటున్న జగన్, ప్రభుత్వంలోని శాఖలన్నింటినీ విచారణ పరిధిలోకి తీసుకురావడం ద్వారా, ఎందరు అధికారులను, ఎన్నేళ్లపాటు విచారిస్తాడో సమాధానం చెప్పాలన్నారు. సెర్బియా అరెస్ట్ కాబడిన నిమ్మగడ్డ ప్రసాద్, జగతి పబ్లికేషన్స్, భారతిసిమెంట్స్ లోకి, ఇతరేతర కంపెనీలద్వారా, తప్పుడు మార్గాల్లో ఎలా సంపాదించారో దానిపై జగన్ నోరు విప్పితే బాగుంటుందని ఆలపాటి ఎద్దేవాచేశారు. తనపై ఉన్న కేసులగురించి, తన అవినీతి చరిత్ర గురించి ప్రజలకు చెప్పి, కోర్టులకుహాజరై తాను దొంగో, దొరో జగన్ నిరూపించుకుంటే మంచిదన్నారు.

జర్నలిజం అనే పదానికి అర్ధం మారిపోయి, ఒక దశాబ్దం అవుతుంది. ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రంలో అయితే, జర్నలిజం అనాలో, ఏమనాలో కూడా అర్ధం కాని పరిస్థతి. సొంత ఎజండా ప్రజల పై రుద్దుతూ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, చూపిస్తూ, ప్రజలను ఏమారుస్తుంది నేటి మీడియా. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి, డబ్బా కొట్టటంలో, పోటీ పడుతూ, డబ్బా కొడుతూ, అధికారంలో ఉన్న వాళ్ళకు చెవులకు ఇంపుగా ఉండేవే వినిపిస్తూ, చూపిస్తూ సాగుతుంది నేటి మీడియా. ఇంకా దరిద్రం ఏమిటి అంటే, రాజకీయ పార్టీలే మీడియా రంగంలోకి అడుగు పెట్టటం, అలాగే పవర్ బ్రోకర్లుగా ఉండే కొంత మంది వ్యాపారవేత్తలు, మీడియా రంగంలోకి అడుగు పెట్టటం. ఇలాంటి వారు జర్నలిస్ట్ విలువలు అనేవి ఏమైనా పాటిస్తారా ? సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నా, అంతా బాగున్నట్టు చెప్తూ, కేవలం భజన చెయ్యటానికే ప్రాధాన్యత ఇస్తుంది నేటి మీడియా. పాలకుల్ని సంతోష పెట్టటం కోసం, ఎంతకైనా దిగజారటానికి, వెనుకాడరు.

trump 2602020 2

అయితే, అమెరికా జర్నలిస్ట్ లు ఇందుకు విరుద్ధం అనే చెప్పే సంఘటన నిన్న ట్రంప్ భారత పర్యటనలో, మన దేశంలోని ప్రజలు చూసారు. వాళ్ళకి ఏమైనా అజెండా ఉందా లేదా అనేది పక్కన పెడితే, సమస్యల పై ఏకంగా ఆ దేశ అధ్యక్షుడినే ఎదురించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. నిన్న ఢిల్లీలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్ లో పాల్గున్నారు. ఈ సందర్భంగా, ప్రపంచ మీడియా మొత్తం అక్కడ వాలిపోయి, ట్రంప్ కి ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా, సీఎన్ఎన్ విలేకరి జిమ్ అకోస్టా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య వాగ్వాదం జరిగింది. విషయం ఏమిటి అంటే, సీఎన్ఎన్ విలేకరి జిమ్ అకోస్టా, డోనాల్డ్ ట్రంప్ కు కొన్ని ప్రశ్నలు సందించారు. త్వరలో మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని తిరస్కరిస్తానని ప్రతిజ్ఞ చేయగలరా?

trump 2602020 3

కీలకమైన, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తిని అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ఎందుకు నియమించాలి అనుకుంటున్నారు అంటూ, ప్రశ్నించటంతో, ట్రంప్ మండి పడ్డారు. నాకు ఏ దేశం సహాయం అవసరం లేదు, తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు సీఎన్ఎన్ క్షమాపణ చెప్పింది అంటూ ట్రంప్ ఎదురు దాడి చెయ్యటంతో, ఆ విలేకరి, వాస్తవాలు ప్రసారం చేయడంలో సీఎన్ఎన్ మీకన్నా బాగుంది, మాకు మంచి రికార్డు ఉంది అని చెప్పటంతో, దానికి ట్రంప్ సమాధానం ఇస్తూ, మీది చెత్త రికార్డు అని బదులిచ్చారు. అయితే, మన దేశంలో మాత్రం, ప్రధాని మంత్రి కాని, ముఖ్యమంత్రులు కాని, అసలు మీడియా ముందే రారు. జరుగుతున్న పరిణామాల పై కనీసం స్పందించరు. కాని మన మీడియా మాత్రం భజన చేసే పనిలోనే ఉంటుంది. తప్పో ఉప్పో, మీడియా ఎప్పుడూ ప్రజల పక్షానే ఉండాలి, పాలకులని ప్రశ్నించాలి. మన దేశంలో మోడీ, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులని, ఇలా ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్ లు, రావాలని కోరుకుందాం.

ఈ రోజుల్లో ఏ వార్త నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, ఇలా ఎవరికి తోచిన వారు, కధనాలు వేస్తూ ఉంటారు. తమకంటూ ఒక అజెండా పెట్టుకుని, ఆ అజెండా ప్రకారమే ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ వార్త నిజమా, అబద్ధామా అనేది అనవసరం. తమకు మైండ్ లో వచ్చిన విషయాన్ని, ఒక వార్త లాగా రాసి, జనాల మీదకు తోసేయటమే. ఇది వరకు, ఎవరి పైన అయనా వార్త వెయ్యాలి అంటే, ఆయనకు ఫోన్ చేసి కాని, కలిసి కానీ, మీ మీద ఈ వార్త వచ్చింది, నిజమా, కాదా, మీ అభిప్రాయం చెప్పండి అనే అడిగి, అప్పుడు వార్త రాసే వారు. ఒక వేళ ఆ కధనం ప్రచురించినా, ఆయన అభిప్రాయం కూడా చివర్లో చెప్పి, ఆ కధనానికి ఒక లాజికల్ కంక్లుజన్ ఇచ్చే వారు. కాని, దాదపుగా ఒక పదేళ్ళ నుంచి, మొత్తం మీడియా స్వరూపమే మారిపోయింది. ఇష్టం వచ్చినట్టు కధనాలు వెయ్యటం, బురద చల్లటం, కడుక్కోండి అని కధనాలు వెయ్యటం. ఈ రకమైన ధోరణి, రాజకీయ పార్టీలకు, సొంత మీడియా రావటంతో మొదలైంది.

yandamuri 25022020 2

ఈ మధ్య కాలంలో, ప్రభుత్వాలకు దగ్గరగా ఉండే మీడియా ఛానెల్స్ కు కాంట్రాక్టు లు ఇచ్చి, వారిని మంచి చేసుకునే ధోరణి కూడా తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. ఇలాంటి వార్తలతో, అధికారాలు పోయిన వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. పింక్ డైమెండ్ అని, తిరుమల శ్రీవారి నగలు అని, శేఖర్ రెడ్డి అని, డేటా చోరీ అని, ఇలా అనేక ఆరోపణలు చేసినా, తెలుగుదేశం వాటిని తిప్పికోట్టలేక, ప్రజలు నిజం అని నమ్మే పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ ఫేక్ ప్రచారం మానలేదు. సొంత ఛానెల్స్ లో కాని, తమకు ఫ్రెండ్లీగా ఉండే మీడియాలో కాని, వ్యతిరేక వార్తలు వేసి, ప్రత్యార్దిని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో, తాము వేసిన ఫేక్ కధనం, నిజం అని నమ్మించటానికి, ప్రముఖుల పేర్లు, ఆ కధనంలో వేస్తూ ఉంటారు.

ఇలాంటి కధనమే ఇప్పుడు ఒక పత్రికలో వచ్చింది. చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ క్యారక్టర్ దెబ్బ తీస్తూ కధనం రాసి, లోకేష్ కు కన్సల్టంట్ గా, ప్రముఖ సినీ రచయత, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్‌ ను, నియమిస్తూ, చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అంటూ, ఒక పత్రికలో కధనం వచ్చింది. దీని వెనుక ఉద్దేశం, లోకేష్ ని బద్నాం చెయ్యటం. అయితే, ఇక్కడ యండమూరి వీరేంద్రనాథ్‌ పేరు తీసుకోవటంతో, ఆయాన ఈ విషయం పై, సీరియస్ గా స్పందించారు. సోషల్ మీడియాలో ఈ వార్తా కధనం పై స్పందిస్తూ "దాదపు 15 సంవత్సరాల క్రితం బాలకృష్ణతో సినిమా చేసే రోజుల్లో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఒకసారి (ఓన్లీ ఒన్స్) కలుసుకున్నాను. లోకేష్ నైతే నేను ఇంతవరకు చూడనే లేదు. ఇలాంటి వార్తల వల్ల ఈ పత్రికల వాళ్ళు ఏం సాధిస్తారో అర్ధం కాదు" అంటూ ఆయన కధనాన్ని ఖండిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

అవినీతి నిరోధానికి ప్రజల్లో మరింత చైతన్య స్పూర్తిని రగిలించేందుకు గాను జగన్ ప్రభుత్వం బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుని రంగం లోకి దించింది. అవినీతి నిరోధానికి గాను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్,14400 నెంబర్ పై సింధుతో పాటుగా జగన్ సందేశం ఇచ్చారు. ఎవరు అవినీతికి పాల్పడినా నిర్భయంగా మీ గొంతు విన్పించండి అంటూ సింధు సందేశంతో కూడిన వీడియోను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. జగన్ అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తున్నారని కూడా సింధు తన సందేశంలో పేర్కొన్నారు. ఈ వీడియోతో పాటు జగన్ సందేశంతో కూడిన ప్రచార వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపాలని, అవినీతిని అంతం చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని కోరారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇచ్చి ప్రజలకు సహకరించాలని జగన్ కోరారు.

video 26022020 2

తన ప్రభుత్వంలో అవినీతి అనే మాటే వినపడకూడదని, తన ప్రభుత్వం వచ్చిన తరువాత అవినీతి లేకుండా చేసామని అన్నారు. అయితే, ఆ వీడియో పై, తెలుగుదేశం పార్టీ సటైర్ల వర్షం కురిపిస్తుంది. జగన్ అవినీతి పై యుద్ధం అంటే, దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది అంటూ, టిడిపి నేతలు వాపోయారు. 11 సిబిఐ కేసుల్లో, 5 ఈడీ కేసుల్లో ఏ1 గా ఉంటూ, 43 వేల కోట్ల అవినీతి చేసారని, సిబిఐ చెప్పటంతో, ఇప్పటికే 16 నెలలు జైలులో ఉండి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, చివరకు దేశం దాటి వెళ్ళాలి అన్నా కోర్ట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళే జగన్, ప్రతి శుక్రవారం అవినీతి కేసుల్లో కోర్ట్ కు వెళ్తున్నారని, ముందుగా తాను అవినీతి చెయ్యలేదు అని నిరూపించుకున్న తరువాతే, ఇలాంటి ప్రకటనలు ఇవ్వాలి అంటూ టిడిపి వాపోయింది.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఏలుతుంటే, జగన్ మాత్రం అవినీతి తగ్గిందని చెప్తున్నారని, తన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జేటాక్స్ పేరుతొ వసూలు చేస్తున్న డబ్బులు అన్నీ ఎవరి దగ్గరకు వెళ్తున్నాయని ప్రశ్నిస్తున్నారు ? రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎలా ఉందొ జగన్ కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో 1500 కు దొరికే ఇసుక, ఈ రోజు 6 వేలు చెప్తుంటే, ఆ డబ్బులు అన్నీ ఎవరు తింటున్నారని ప్రశ్నిస్తున్నారు. వైన్ మాఫియా, సాండ్ మాఫియా, మైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలా అన్ని మాఫియాలు జగన్ ప్రభుత్వంలో ఉన్నాయని, జే టాక్స్ పేరుతొ , ప్రతి వ్యాపారంలో వాటాలు తీసుకుంటూ, వీళ్ళా అవినీతి గురించి మాట్లదేదని టిడిపి ప్రశ్నిస్తుంది. ముందుగా జగన్ తన అవినీతి కేసుల నుంచి బయట పడితే, అప్పుడు ఇలాంటి ప్రచారాలు చేసుకోవచ్చని టిడిపి ఆరోపిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read