దేశంలోనే నాలుగో అతి పెద్ద సర్వీసెస్ కంపెనీ హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ ఆంద్రప్రదేశ్ లో తన బ్రాంచ్ ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే... అమరావతి రాజధాని ప్రాంతంలో, గన్నవరం దగ్గర కేసరపల్లిలో ఎల్‌అండ్‌టీ హై టెక్‌ సిటీ పక్కన ఇప్పటికే హిందుస్థాన్‌ కార్పొరే షన్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) కు ప్రభుత్వం భూమి కూడా అప్పగించింది. ఈ ప్రాజెక్టులో హెచ్‌సీఎల్‌ రూ.750 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. తద్వారా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో ఈ నూతన భవంతుల్ని నిర్మించనున్నారు.

hcl 14012018 2

రెండు నెలల క్రితం కంపెనీ చైర్మన్‌ శివనాడార్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు... హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రాష్ట్రంలో స్థాపించనున్న గ్లోబల్‌ ఐటీ డెవల్‌పమెంట్‌, శిక్షణ కేంద్రాల డిజైన్లు ముఖ్యమంత్రికి చూపించారు... గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయని శివనాడార్‌ ముఖ్యమంత్రికి తెలిపారు... సుమారు 50 ఎకరాల్లో హెచ్‌సీఎల్‌ క్యాంప్‌సలు కొలువుదీరనున్నాయి. 2019 జూన్‌కల్లా గన్నవరంలోని హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ సిద్ధమవుతుంది..

hcl 14012018 3

ఇది ఇలా ఉండగానే, హెచ్‌సీఎల్‌ అప్పుడే గన్నవరంలో నిర్మించే కంపనీలో ఉద్యోగాల ప్రకటనలు కూడా ఇస్తుంది... ఫైనాన్సు సెక్టార్ లో, ఫ్రెషేర్స్ కి కూడా ఉద్యోగాల ప్రకటన ఇచ్చింది... ముఖ్యంగా గన్నవరంలో కంపెనీ సిద్ధం అయ్యే లోపు, కావలసిన వారిని తీసుకుని, ఇప్పటి నుంచే వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు.. ఫ్రెషేర్స్ తో పాటు, ఎక్స్పీరియన్స్ కాండిడేట్ లకు కూడా ఉద్యోగాల ప్రకటనలు ఇచ్చింది... దాదాపు సంవత్సరానికి 7 లక్షల నుంచి, 11 లక్షల దాకా జీతం ఉంటుంది అని తెలిపింది... పూర్తి ఉద్యోగాల ప్రకటన ఇక్కడ చూడవచ్చు... https://www.naukri.com/hcl-jobs-in-vijayawada-guntur కావలసిన వారు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read