Sidebar

11
Sun, May

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరులో పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే చంద్రబాబు, మధ్యాహ్నం 1:15 నిమిషాలకు ఏలూరులోని టిడిపి సీనియర్ నేత, మాజీ మాగంటి బాబు గారు నివాసానికి వెళ్లి, వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇటీవల మాగంటి బాబు కుమారుడు, మాగంటి రాంజీ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కుమారుడిని కోల్పోయి విషాదంలో మునిగిపోయిన, మాగంటి బాబు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. తరువాత, 2 గంటలకు క్రాంతి కళ్యాణ మండపనికి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పరిమితం అవుతారా, లేదా తరువాత స్థానిక తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో ఏమైనా మాట్లాడతారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఈ రోజు సిఐడి నోటీసులు ఇచ్చిన తరువాత, చంద్రబాబుని అరెస్ట్ చేస్తాం అంటూ, హడవిడి చేస్తున్న వైసీపీ నేతలకు సమాధానంగా చంద్రబాబు ఏమైనా మీడియాతో మాట్లాడతారా అనేది కూడా చూడాల్సి ఉంది. సిఐడి నోటీసులు ఇచ్చిన తరువాత, ఈ రోజు న్యాయనిపుణులతో చర్చించిన చంద్రబాబు, ఈ విషయం పై ఎలా ముందుకు వెళ్తారు అనేది చంద్రబాబు ఏమైనా చెప్తారా అనే అంశం పై ఆసక్తి నెలకొంది.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read