చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఈ రోజు బెజవాడ బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో, కీలక వ్యాఖ్యలు చేసారు. నాకు కష్టం వచ్చినప్పుడు, ఇక్కడ బెజవాడ బార్ అసోసియేషనే కాకుండా, దేశ వ్యాప్తంగా బెజవాడ బార్ అసోసియేషన్లు అండగా నిలిచారని అన్నారు. ఆయనకు వచ్చిన ఇబ్బంది అంటే, ఈ మధ్య కాలంలో, ఆయన పై వచ్చిన ఫిర్యాదు. దాన్నే చీఫ్ జస్టిస్ పరోక్షంగా ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ బెజవాడ బార్ అసోసియేషన్ తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని చెప్పారు. ఇక్కడే ఆయన కెరీర్ లో మొదటి అడుగు పడిందని అన్నారు. అప్పటికీ ఇప్పటికీ, చాలా మార్పులు ఇక్కడ వచ్చీని అన్నారు. ఇక్కడ బార్ అసోసియేషన్ చాలా గొప్పగా ఉండేదని, ఇక్కడే చాలా విషయాలు తాము డిస్కస్ చేసుకునే వారమని అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ లో ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇక్కడ నీరు, గాలి పీల్చే, ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. అలాగే న్యాయ వ్యవస్థ పాత్ర ఈ సమాజంలో చాలా ఉందని అన్నారు. ఆలాంటి న్యాయ వ్యవస్థను కించపరచకూడదని, జడ్జిలపై దా-డు-లు, అవమానాలను ప్రశ్నించాలని అన్నారు. ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాలు పెంచాలని అన్నారు.
నాకు ఇబ్బంది వచ్చినప్పుడు, మద్దతుగా నిలిచారు... పరోక్షంగా తన పైన ఇచ్చిన ఫిర్యాదు సంఘటన గుర్తుచేసుకున్న చీఫ్ జస్టిస్..
Advertisements