ఏడాది క్రితం గుడివాడలో గడ్డం గ్యాంగ్ ఆగడాలు అంటూ, కొన్ని కధనాలు ప్రసారం అయిన విషయం అందరికీ తెలిసిందే. ఒక మంత్రి అనుచర గణం అయిన ఈ గడ్డం గ్యాంగ్, చేసిన అరాచకాలు అప్పట్లో, ప్రచురితం అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్ళీ గడ్డం గ్యాంగ్ ఆగడాలు బయటకు వస్తున్నాయి. ఒక వైశ్య సామాజికవర్గంకు చెందిన కుటుంబాన్ని, ఈ గడ్డం గ్యాంగ్ టార్గెట్ చేసింది. గడ్డం గ్యాంగ్ అనుచరులు, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు వర్తలు వస్తున్నాయి. తమకు సాయంత్రం లోగా కోటి రూపాయాలు డబ్బు చెల్లించకపోతే కనుక, శాల్తీ ని లేపెస్తాం అంటూ హెచ్చరించారని కధనాలు వస్తున్నాయి. ఈ గ్యాంగ్ బెదిరింపులతో, ఆ కుటుంబం భయపడి పోతుంది. బెరిదిపోయిన వీరు, దూర ప్రాంతానికి వెళ్లి, మీడియాకు సమాచారం అందించారు. గడ్డం గ్యాంగ్ ఆగడాల నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయం మీడియాలో రావటంతో, ఇప్పుడు ఇది చర్చనీయంసం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే, ఈ గడ్డం గ్యాంగ్ దగ్గర ఒక వ్యాపారి అప్పు తీసుకున్నాడు. వీళ్ళ వేధింపులు తట్టుకోలేక చనిపోయారు. అప్పటి నుంచి ఆయన కుమారుడుని వేధిస్తున్నారు. కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నారు. అయితే కోటి రూపాయల తీసుకోలేదని, ఏ ఆధారాలు లేకుండా కోటి కట్టమని బెదిరిస్తున్నారని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ కధనాలు అన్నీ మీడియాలో వస్తున్నాయి.
గుడివాడలో రెచ్చిపోయిన గడ్డం గ్యాంగ్...
Advertisements