Sidebar

04
Sun, May

అధికార వైసీపీలో సీట్ల చర్చలు జోరుగా సాగుతున్నాయి. 70 మందికి పైగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని గత సమీక్షలలో సీఎం జగన్ రెడ్డి హెచ్చరించారు. తాజా సమీక్షకు రెడీ అవుతున్న సీఎం ముందు ఐప్యాక్ ఓ నివేదిక ముందు ఉంచిందని వార్తలు వస్తున్నాయి. దీనిప్రకారం 40 మంది ఎమ్మెల్యేల  అస్సలు బాగాలేదని తెలుస్తోంది. వీరందరికీ 14వ తేదీన జరగనున్న సమావేశంలో చివరి హెచ్చరిక జారీ చేయనున్నారని సమాచారం. 151 మందిలో 70 మందికిపైగా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలే వున్నారని చేసిన సర్వేలు లీకయ్యాయి. వై నాట్ 175 అంటోన్న సీఎం సొంత సర్వేలో ఇంతమంది ఓడిపోతున్నారని తెలిసినా, ఎందుకీ మేకపోతు గాంభీర్యం అనే అనుమానాలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read