కృష్ణాజిల్లాలోని ప్రభుత్వకార్యాలయాలు, ఇతర ముఖ్య సంస్థలను, కొత్తగా నిర్మించాలనుకుంటున్నవాటిని ముఖ్య మంత్రి జగన్ రెడ్డి తనసొంతజిల్లా అయిన కడపకు తరలిస్తూ, రాజధానిప్రాంతానికి తీవ్రఅన్యాయం చేస్తున్నాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేయాల నుకున్న పశుసంవర్థకశాఖ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వమిచ్చిన జీవోపై స్పందించకుండా సదరుజిల్లాకు చెందిన మంత్రులు, అధికారపార్టీఎమ్మెల్యేలు ఏంచేస్తున్నార ని రఫీ ప్రశ్నించారు. చంద్రబాబుని, టీడీపీని దూషించడానికి నోరుతెరిచే మంత్రులు, ముఖ్యమంత్రి ఇంతచేస్తున్నా ఎందు కు నిస్సహాయస్థితిలో ఉన్నారన్నారు. వెల్లంపల్లిశ్రీనివాస్, పేర్నినాని, కొడాలినాని లు ముఖ్యమంత్రిని ఈ వ్యవహారంపై ఎందుకు నిలదీయలేకపోతున్నారని రఫీ నిలదీశారు. మెట్రో కార్యాలయం, విజిలెన్స్అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం, కృష్ణా ట్రైబ్యునల్ కార్యాలయాలను విజయవాడనుంచి వివిధ ప్రాంతాలకు తరలించారన్నారు. విజయవాడపై ముఖ్యమంత్రి కి ఎందుకంత కసి, కోపమో ఆయనే చెప్పాలన్నారు. కృష్ణా జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి ఈవిధంగా అన్యాయం చేస్తు న్నా, సదరు మంత్రులు ఎందుకు నోరెత్తడంలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అన్నీఇచ్చేసిన ముఖ్యమంత్రి, అమరావతిని కూడా ధ్వంసం చేసేపనిలో ఉన్నాడన్నారు. పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ భవనాలను కూల్చేసి, సరికొ త్తహంగులతో నూతనభవనాలు నిర్మించుకుంటుంటే, ఇక్కడే మో జగన్ ఉన్నవాటిని నాశనం చేస్తున్నాడని రఫీ వాపోయా రు. జగన్ మిత్రుడైన కేసీఆర్ నుంచి రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడంలో ఏపీసీఎం ఘోరంగా విఫలమయ్యాడన్నా రు. 58-42 నిష్పత్తిప్రకారం విజయడెయిరీ ఆస్తులను ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని కోర్టు తీర్పుచెప్పిందని, అదేవిధంగా ఆర్టీసీ ఆస్తులను కూడా పంచాల్సి ఉండగా, దానిపై జగన్ ఎందుకు కేసీఆర్ ని ప్రశ్నించలేకపోతున్నాడన్నారు.

జెన్ కో నుంచి ఏపీకి రూ.7కోట్లు రావాల్సి ఉందని, ఉద్యోగుల విభజ న వ్యవహారంకూడా కోర్టులో ఉందని, దాన్ని కూడా జగన్ పట్టించుకోవడంలేదన్నారు. అమరావతికి కేటాయించిన రైలు మార్గానికి రాష్ట్రంవాటాగా అవసరమైన నిధులు ఇవ్వకపోవ డంతో ఆప్రాజెక్ట్ కూడా అటకెక్కిందన్నారు. ప్రత్యేకహోదా, రై ల్వేజోన్, పోలవరం నిధులు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై కేంద్రాన్నిప్రశ్నించలేని దుస్థితిలో జగన్ ఉన్నాడన్నారు. ఈవిధంగా రాష్ట్రానికి రావాల్సినవాటిని వది లేస్తూ, ఉన్నవాటిని వేరేవారికి అప్పగించేస్తున్న జగన్ అంతి మంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడన్నారు. కృష్ణాజిల్లాలోని కార్యాలయాలను పులివెందులకు తరలించడం ఏమిటన్నా రు. కేవలం పులివెందులలోనే రూ.663కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి, తనతండ్రిసమాధి సుందరీకరణ పనులకోసం రూ.27కోట్లను కేటాయించాడన్నా రు. జగన్ వైఖరి చూస్తుంటే, ఆయన రాష్ట్రానికి ముఖ్యమం త్రా లేక పులివెందులకా అన్న అనుమానం కలుగుతోందన్నా రు. కేంద్రం, పొరుగురాష్ట్రంనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల ను, భవనాలను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నవాటిని తనసొంత జిల్లాకు, తరలించుకోవడం ఏమిటని రఫీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చర్యలతో ప్రాంతీయవిబేధాలు తలెత్తే అవకాశముందన్నారు.

రాజధానిప్రాంతంలో నివాసం ఉంటూ, అక్కడినుంచే పాలనచేస్తున్న ముఖ్యమంత్రి తనప్రేమనంతా పులివెందులపై చూపడం ఏమిటన్నారు. ఉన్న కార్యాలయాలను యథాతథంగాఉంచేసి, కొత్తవాటిని తన ప్రాంతంలో ఏర్పాటుచేసుకునేదిశగా ముఖ్యమంత్రి ఆలోచిస్తే మంచిదని రఫీ హితవుపలికారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన వాటిని ఈ ముఖ్యమంత్రి ఎందుకొదిలేశాడో చెప్పాలన్నారు. కేసీఆర్ చెప్పాడని పోలవరం ఎత్తుతగ్గించడా నికి జగన్ రెడ్డి సిద్ధమవ్వడం సిగ్గుచేటన్నారు. టీడీపీనేతల ను వేధించడం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం, ప్రజల ను సంక్షేమపథకాల పేరుతో మోసగించడం తప్ప, తనపాల నలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీలేదన్నారు. రూ. 3,600కోట్లవరకు స్థానికఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఖర్చు చేసినట్లు జనచైతన్యవేదిక వారు చెప్పారన్నారు. పులివెందు ల నియోజకవర్గం మాదిరే, ఇతర నియోజకవర్గాలపై కూడా జగన్ దృష్టిసారించాలన్నారు. కృష్ణాజిల్లాలోని కార్యాలయాల ను ఇతరప్రాంతాలకు తరలించే ఆలోచనలను ముఖ్యమంత్రి తక్షణమే మానుకోవాలని రఫీ డిమాండ్ చేశారు. ఆ జిల్లా మంత్రులుకూడా ప్రజలముందుకొచ్చి, ముఖ్యమంత్రి చర్యలపై సమాధానంచెప్పాలన్నారు. విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవే టీకరణను అడ్డుకునేదిశగా ముఖ్యమంత్రి తక్షణమే తనకార్యాచరణ ప్రకటించి ప్రజల్లోకి వచ్చిపోరాడాలని రఫీ డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read