Sidebar

01
Thu, May

ప్రతి ఆంధ్రుడు సిగ్గు పడాలి.. పక్క రాష్ట్రం వారు మనలని హేళన చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు పక్క రాష్ట్రంలో ఉండే కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ని హేళన చేస్తూ మాట్లాడిన మాటలు విని, ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కేటీఆర్ క్రెడాయ్ సదస్సులో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని, సంక్రాంతికి సొంత ఊరికి వెళ్ళాడని, అక్కడ దారుణమైన రోడ్డులు చూసి, నీళ్ళు లేక, కరెంటు లేక ఇబ్బంది పడ్డానని చెప్పాడని, మళ్ళీ తిరిగి హైదరాబాద్ వస్తే కానీ తనకు ఊపిరి ఆడ లేదని చెప్పాడని, ఆంధ్రప్రదేశ్ లో నరకం అంటే ఏంటో కనిపించిందని, తెలంగాణాలో ప్రశ్నిస్తున్న వారిని, బస్సులు వేసి ఆంధ్రప్రదేశ్ పంపిస్తే, అక్కడ పరిస్థితి చూసి ఎలా ఉందో, ఇక్కడ హైదరాబాద్ లో ఎలా ఉందో వారికే తెలుస్తుంది అంటూ, కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇలాంటి వాటికి ఉదాహరణగా చెప్పుకుంటున్నారు అంటే, మన పరిస్థితి రోజు రోజుకీ ఎలా ఉంటుందో చూస్తేనే అర్ధం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read