Sidebar

30
Wed, Apr

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, నారా లోకేష్ ఈ రోజు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించి, బహిరంగ సభలో పాల్గున్నారు. ఈ సందర్భంగా, నాయుడుపేటలో జరిగిన సభలో, సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. జగన్ మోహన్ రెడ్డి 14వ తేదీ తిరుపతి వస్తున్నారని, ఈ సందర్భంగా ఆయనకు సవాల్ విసురుతున్నా అని అన్నారు. వైఎస్ వివేకను మేము చం-పిం-చామని అంటున్నారని, మా పైన ఆరోపణలు చేసారని, అందుకే 14వ తారిఖు మనం ఇద్దరం వెంకన్న సాక్షిగా ప్రమాణం చేద్దామని అన్నారు. అందులో, నా ప్రమేయం కానీ, నా కుటుంబం ప్రమేయం లేదని, తాను ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నాని, జగన్ రెడ్డి కూడా, తనకు, తన కుటుంబ సభ్యులకు కానీ, ఈ హ-త్య లో ఎలాంటి సంబంధం లేదని, వెంకన్న ముందుకు వచ్చి ప్రమాణం చేయగలరా అని, సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు, జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకునే స్థితిలో పడ్డారు. ఇప్పటికే ఈ విషయం పై, గత వారం రోజులుగా అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తుంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి, ఆమె తల్లి విజయమ్మని రంగంలోకి దించారు. జగన్ మోహన్ రెడ్డికి ఏమి సంబంధం లేదని, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ, ఒక అయుదు పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే.

lokesh 070420212

ఇక మరో పక్క లోకేష్ తన ప్రసంగంలో జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి ఉన్న 28 మంది ఎంపీలను, తోలు బొమ్ములుగా వర్ణించారు. మొదటి రోజు గొర్రెలు, రెండో రోజు రోబో, మూడో రోజు పిల్లులు అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఎంపీలను సంబోధించిన లోకేష్, ఈ రోజు తోలుబొమ్మలు అంటూ హేళన చేసారు. వీళ్ళు రాష్ట్ర సమస్యల పై మోడీని నిలదీయలేరని, మోడీ కనిపిస్తే, కాళ్ళ మీద పడతారని అన్నారు. పుదిచ్చేరి కి హోదా ఇస్తాం అని బీజేపీ అంటే, ఈ తోలు బొమ్మలు పుదిచ్చేరి వెళ్లి బీజేపీకి ఎన్నికల ప్రచారం చేసి వచ్చారని అన్నారు. నెల్లూరు , చిత్తూరు జిల్లాలో ఒక్క విభజన హామీ పైన అయినా, ఈ తోలుబొమ్మలు పోరాటం చేస్తున్నాయా అని ప్రశ్నించారు. కృష్ణపట్నం,దుగ్గిరాజపట్నం,రామాయపట్నం పోర్ట్లు,నెల్లూరు ఎయిర్ పోర్ట్ , ఇలా ఒక్కటి కూడా పట్టించుకోలేదని లోకేష్ అన్నారు. ఒక సీనియర్ మహిళగా, అనుభవం ఉన్న వ్యక్తిగా, మహిళలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం గురించి పోరాడే, మన ఇంటి లక్ష్మీ, పనబాక లక్ష్మీ గారిని గెలిపించాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read