Sidebar

14
Fri, Mar

నగరి ఎమ్మెల్యే మినిస్టరా? యాక్టరా? అనే అనుమానాలు వైసీపీ నుంచే వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక,యువజనాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి నేటివరకూ ఎప్పుడూ సంబంధిత శాఖా సమావేశాలలో పాల్గొన్న సందర్భం లేదు. నిత్యమూ ఏదో ఒక చోట వేదికలపై డ్యాన్సులు వేస్తూ, సెల్ఫీలు దిగుతూ సోషల్మీడియాలో పోస్టు చేయడం తప్పించి సంబంధిత శాఖలలో ఎటువంటి పనితీరు కనిపించకపోవడంతో రోజాని మంత్రివర్గంలో నామ్ కే వాస్తేగా ఉంచారనే రూమర్లు ఉన్నాయి. మంత్రి పదవి వరించగానే జబర్దస్త్, బతుకు జట్కా బండి కార్యక్రమాలు ఆపేసిన రోజా..ఇప్పుడు బహిరంగసభలలో అవే పాత్రలు పోషిస్తున్నారు. నటనపై మోజు తీరలేదో, శాఖలలో చేయడానికి పనిలేదో తెలియదు కానీ నిత్యమూ సెల్పీలు, డ్యాన్సులతోనే రోజా కాలం వెళ్లబుచ్చుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి ఇష్టంలేకపోయినా రోజాకి మంత్రి పదవి ఇవ్వాల్సి రావడంతో పవర్ లేని మినిస్టర్ గా చేశారని టాక్ వినిపిస్తోంది.

అందుకే ఆరుబయట ఈ డ్యాన్సులని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు అంటూ డ్యాన్సులు చేయిస్తున్నారు. వీటికి ముఖ్యఅతిథిగా రోజా హాజరై ఆమే డ్యాన్సులు వేస్తోంది. యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిి, టిడిపిలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టి ఐరన్ లెగ్ గా ముద్రపడి కాంగ్రెస్లో చేరింది రోజా. ఈమె చేరిన వెంటనే కాంగ్రెస్ సీఎం వైఎస్ చనిపోవడంతో ఈ పేరు స్థిరపడింది. చివరికి వైెెఎస్సార్సీపీలో చేరి నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వరించింది. తన ఐరన్ లెగ్ ముద్ర చెరిపేసుకుంది. మంత్రిగా ఎంతో పని ఉండగా, ఆమె తన విమర్శకులకు పనితో తోనే సమాధానం చెప్పే అవాకాసం ఉన్నా, తన పనులతో, మరింత విమర్శలు పలు అవుతున్నారు. మినిస్టర్ అయినా చేసేందుకు పనిలేక, చేస్తామన్న పని ఇవ్వక యాక్టర్ గా వేదికలపై ప్రదర్శనలు ఇస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read