Sidebar

14
Fri, Mar

విశాఖపట్నంలో, రుషికొండకు కొట్టిన బోడి గుండు గురించి రాష్ట్రం మొత్తం ఆవేదన చెందుతుంటే, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం, సింపుల్ గా కొట్టి పడేసారు. వాటర్ మెన్ అఫ్ ఇండియా రాజేంద్రసింగ్‌ విశాఖ వచ్చి రుషికొండని చూసి కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీని పై విలేఖరులు సజ్జలని అడగగా, ఆయన స్పందిస్తూ, రుషికొండ ఏమైనా పెద్ద అంతర్జాతీయ సమస్యా? అని ప్రశ్నించారు. తవ్వే వాళ్ళు గుట్టను టన్నుల్లెక్కన లెక్కగట్టి తవ్వాలా? అని ప్రశ్నించారు. గతంలో ఏ కొండ పైన ఎవరూ ఏమి తవ్వలేదా అని ప్రశ్నించారు. సజ్జల చేస్తున్న ఎదురు దా-డి చూసి విలేఖరులు షాక్ తిన్నారు. రుషికొండ పై ప్రభుత్వానికి ఏ మాత్రం సీరియస్ నెస్ ఉంది అనే విషయం, సజ్జల మాటలతోనే అర్ధం అవుతుందని, పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read