Sidebar

14
Wed, May

కింగ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య(బ్రహ్మానందం) పుట్టిన రోజుని బొట్టు శ్రీను (నాగార్జున) ఎలా సెలబ్రేట్ చేస్తానంటాడో గుర్తుందా? బ్రహ్మి పుట్టినరోజుకి బ్రహ్మితోనే రక్తదానం చేయిస్తాననడం ఈ మూవీలో హైలైట్ కామెడీ సీన్. ఇప్పుడు ఏపీలో ఇంచుమించు ఇలాంటి సన్నివేశాలే జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ బయటపడుతున్నాయి. సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయాలంటూ కాకినాడ జిల్లాలో కీలక శాఖల ఉద్యోగులపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి. రక్తదానం చేయాల్సిందేనంటూ బలవంతం చేస్తున్నారు. దీంతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జగన్ పుట్టిన రోజైతే జనం రక్తం ఎందుకు జలగల్లా పీల్చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మీకు అంత సరదాగా వుంటే మీరివ్వండంటూ ఉన్నతాదికారులపై తిరగబడుతున్నారు.   ఒక్కో మండలం నుంచి కనీసం 200 యూనిట్ల బ్లడ్ ప్రభుత్వ ఉద్యొగులు దానం చేయాలని టార్గెట్ విధించారు. మండలంలో ఏ శాఖలో ఎ ఊరులో పనిచేస్తున్న వారైనా మండల కేంద్రానికి వచ్చి రక్తం ఇచ్చి వెళ్లాల్సిందేనని తాఖీదులు పంపారు. తమ పరిధిలోని డ్వామా, సచివాలయ, పంచాయతీ తదితర శాఖల ఉద్యోగులు ఉదయాన్నే వచ్చి రక్తం దానం చేయాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. ఉద్యోగుల రక్తం పీల్చే బాధ్యతలను ఎంపీడీవోలు చూశారు. మరోవైపు కళాశాలల్లో విద్యార్థుల నుంచి బలవంతంగా రక్తదానం చేయించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read