Sidebar

06
Tue, May

రాష్ట్రం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ఎదురు తిరిగింది... చివరకు ఎంతో సహనంతో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, మిత్రపక్షం అనే ఇది కూడా లేకుండా, మోడీ చేస్తున్న పనులు అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు... చివరకు టిడిపి మంత్రుల్ని రాజీనామా చేపించారు కూడా... ఢిల్లీ పై ఇక యుద్ధమే అనే సంకేతాలు పంపించారు... ఈ పరిణామాలకు ప్రధాన కారణం అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టి, ఇంకా ఇంతకు మించి మేము సాయం చెయ్యలేము అంటూ, ఇక హోదా అనే మాటే లేదు అని తెగేసి చెప్పటం... దీంతో చంద్రబాబు ఇక కేంద్రంతో తేల్చుకునే పనిలో పడ్డారు...

vijasayi 09032018

కాని ప్రధాన ప్రతిపక్షం మాత్రం, దొంగ నాటకాలు ఆడుతుంది... తన కేసులు మాఫీ కోసం, నటనలు చేస్తూ సీన్ పండిస్తున్నారు... మోడీని ఒక్క మాట, ఒక్క ప్రశ్న అడిగే దమ్ము ఒక్కరికి కూడా లేదు... ఎంత సేపు చంద్రబాబు చంద్రబాబు అనే జపం చెయ్యటమే... తాజగా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, విజయసాయి రెడ్డి, నిస్సిగ్గుగా వాళ్ళ ప్లాన్ ఏంటో బయట పెట్టాడు... మాకు రాష్ట్రం ముఖ్యం కాదు, మా కేసులే ముఖ్యం అనే విధంగా మాట్లాడారు... ఇండియా టుడే ఇంటర్వ్యూ లో, విజయసాయిని యాంకర్ ఒక ప్రశ్న అడిగారు... "బీజేపీ హోదా ఇవ్వను అంటుంది రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇస్తాను అంటున్నాడు, మీరేమో ఎవరు హోదా ఇస్తే వారితో కలుస్తా అంటున్నారు, మరి రాహుల్ తో కలుస్తారా అని ప్రశ్నించారు"

vijasayi 09032018

అప్పుడు విజయసాయి మాట్లాడుతూ, రాహుల్ అంటే నమ్మకం లేదు అని చెప్పారు... కాని మోడీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది అని, మోడీ తప్పకుండ హోదా ఇస్తారంటూ, విస్మయం కలిగించే సమాధానం చెప్పారు.. తన నోటితో తానే, వాళ్ళ రాజకీయ వ్యూహం బయటపెట్టారు.. అంటే కొన్ని రోజులుగా ప్రచారంలో ఉనట్టు, వైసిపీతో పొత్తు కోసం, టిడిపిని బయటకు గెంటారు... ఇప్పుడు హోదా అనో, ఎదో ఒక సోది చెప్పి, టిడిపి మీద నెపం నెడతారు... అప్పుడు జగన్ వెళ్లి బీజేపీతో చేరతాడు.. ఇదే వీరి వ్యూహం అని చెప్పకనే చెప్పారు.. ఎందుకంటే, ప్రస్తుతం, బీజేపీ హోదా అనే మాటే లేదు అంది... రాహుల్ నేను మొదటి సంతకం హోదా మీద అంటున్నాడు... మరి హోదా ఎవరు ఇస్తే వారే మాకు కావలి అనే జగన్, ఇప్పటికీ మోడీ మీద ఎలా నమ్మకం పెట్టుకున్నాడు ? రాహుల్ ఇస్తాను అంటున్నా, కనీసం ఎందుకు స్వాగాతించటం లేదు ? రాబోయే రోజుల్లో, వీరి నాటకాలు బయట పడతాయి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read