Sidebar

17
Mon, Mar

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి.. సీబీఐ మాజీ జేడీ, జనసేన ఎంపీ అభ్యర్థి వివి లక్ష్మీ నారాయణకు మధ్య గత వారం రోజులుగా ట్వీట్ వార్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ల పై ఒక ఇంటర్వ్యూ లో లక్ష్మీనారాయణ దీని పై మరింత క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు ఆహ్వానం వచ్చిందని సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. వైసీపీ లో చేరాలని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి తనను స్వయంగా ఆహ్వానించారని చెప్పారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..‘నాకు విజయసాయిరెడ్డి ఫోన్ చేసి అది(జగన్ అరెస్ట్) మీరు వృత్తిపరంగా చేశారు.

vv 24042019

రాజకీయాలు వేరే. మేం కూడా ప్రజల కోసం మంచి పనులు చేయాలనుకుంటున్నాం. అందుకే జగన్ పాదయాత్ర కూడా చేశారు. కాబట్టి గతంలో జరిగింది పక్కన పెట్టేసి మీరు కూడా ప్రజల కోసం ఇందులో భాగస్వామి అయితే బాగుంటుందని చెప్పారు’ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో వేర్వేరు పార్టీల నుంచి ఆహ్వానం రావడం అన్నది సాధారణమేనని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక రకరకాల ఆలోచనలతో ఉన్న పార్టీలు సంప్రదిస్తాయనీ, కానీ తన ఆలోచనతో ఉన్నవారితోనే కలిసి పనిచేస్తానని గతంలోనే స్పష్టం చేశానని గుర్తుచేశారు.

vv 24042019

పోయిన శనివారం విజయసాయిరెడ్డి ట్వీట్లకు లక్ష్మీనారాయణ ఘాటుగా సమాధానమిచ్చారు. జనసేన 65 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టిందని విజయసాయిరెడ్డి శుక్రవారం ట్వీట్‌ చేయడంతో తాము 140 స్థానాల్లో పోటీకి దిగామని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. దీనికి స్పందనగా మళ్లీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేస్తూ చంద్రబాబుకు ఇచ్చిన బీఫారాలు పోనూ జనసేన 65 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిందని, 80 సీట్లలో డమ్మీలే ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై లక్ష్మీనారాయణ స్పందిస్తూ... విజయసాయిరెడ్డికి హైదరాబాద్‌, దిల్లీ ట్యూషన్లు సరిగా పని చేయడం లేదని, ట్యూషన్‌ మాస్టార్లు కోప్పడతారని, ఒకసారి లెక్కలు సరి చూసుకోవాలని హితవు పలికారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read