పెట్రోల్ బంకు డీలర్ల సమస్యలను కేంద్రం ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో, పెట్రల్ బంకులు దేశ వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. ముందుగా గురువారం, శుక్రువారం డీలర్లు పెట్రో కంపెనీల నుంచి అయిల్ కొనుగోళ్లను నిలిపివేయనున్నారు.
నిరసనల్లో భాగంగా నవంబర్ 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పెట్రోల్ బంకులు పనిచేస్తాయి. 6వ తేదీన పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకులు బంద్ పాటిస్తున్నాయి. ఈ మేరకు ఎపి ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆందోళన బాట పట్టినట్లు చెప్పారు.
Advertisements